శుక్రవారం, ఆగస్టు 26

కరుణామయి మదర్ థెరిస్సా


మహోన్నతమైన వ్యక్తులు ఐదడుగులు వేస్తే ఐదువేల అడుగులవరకు వారి దివ్యత్వం వ్యాపిస్తోంది. అమ్మ మదర్ థెరిస్సా కూడా ఈ కోవకు చెందిందే. ఎక్కడో లెబనాన్‌లో పుట్టిన ఆమె ఇండియాకు వచ్చి భారతీయులందరికే కాదు ఈ ప్రపంచానికే అమ్మ అయింది. దాదాపు 45 ఏళ్లపాటు అనాథలకు, ఆర్తులకు, దీనుల పాలిట దేవతైంది. భారతదేశంలోని కలకత్తాను కేంద్రంగా చేసుకొని ఆ మహనీయురాలు ఆరంభించిన సేవా సంస్థలు నేడు ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి దీనులను ఆదుకుంటున్నాయి.


1   910 ఆగస్టు 26న మదర్ థెరీసా జన్మించి 1997 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. ఆమె జన్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఈ సేవామూర్తి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధులవరకు ఈ సేవామూర్తి సేవలను స్మరించుకునే రోజులివి. ఈ సందర్భంగా ఈ మహనీయురాలి జీవితంలోని కొన్ని విశేషాలు.
అమ్మ జీవితంలో ఐదు సత్యాలు
మదర్ థెరీసా తన 18వ ఏటే అంటే 1918 సెప్టెంబర్ 18న తల్లిదండ్రులను విడిచి మిషనరీని స్థాపించారు.
ఆ రోజుల్లో భారతదేశం బ్రిటీష్‌వారి పాలనలో ఉంది. కలకత్తాలోని విక్టోరియా ఆర్కిటెక్చర్ ప్రాంతం విలాసవంతమైన ధనవంతులు నివాసం ఉండే ఏరియా. దీనివెనుకే పేదలు నివసించే మురికివాడ ఉండేది. ఇక్కడనుంచే మదర్ తన సేవా కార్యక్రమాలను ఆరంభించారు.
కలకత్తా నడిబొడ్డులో మదర్ ఇల్లు ఉండేది. యువ నన్స్ ఇక్కడే సేవా కార్యక్రమాల్లో శిక్షణ తీసుకునేవారు. ఈ నన్స్‌కు రెండు చీరెలు, ఒక జత చెప్పులు, ప్రార్థనా పుస్తకాన్ని ఇచ్చేవారు.
ఆరవ పోప్ పాల్ ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో పోప్ పాల్‌ను మదర్ థెరీసా తన పనుల్లో బిజీగా ఉండి కలువలేకపోయారు. ఆమె సేవా కార్యక్రమాలను, పనులను గుర్తెరిగిన పోప్ పాల్ తన కారు స్వయంగా పంపి ఆమెను తన బస చేసిన నివాసానికి రప్పించుకుని ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారట.
చివరి క్షణాల్లో ఉన్న పేదలు ప్రశాంత జీవనం గడపటానికి ఓ భవనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో ఆమె ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలియజేశారు. అధికారులు ఆమెను కాలిఘాట్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న స్థలాన్ని చూపించారు. ఆ స్థలం హిందువుల దేవాలయానికి వెనుకే ఉంది. అక్కడే ఆ మాతృమూర్తి ‘నిర్మల్ హృదయ్’ అనే పేరుతో భవనాన్ని నిర్మించారు. ‘నిర్మల్ హృదయ్’ అంటే స్వచ్ఛమైన మనస్సు అని అర్ధం. ఈ పేరును మదర్ థెరీసానే పెట్టారు.


అమ్మ ఎపుడూ అద్భుతమే: జోషి
ప్రేమను, ప్రేమించటాన్ని మనమే సృష్టించుకోవాలని మదర్ ఎపుడూ చెబుతుండేవారని, ఆమె మా కళ్లకు ఎపుడూ అద్భుతంగానే కనిపించేదని కేరళకు చెందిన మేరీ జోషి అంటారు. అతి పిన్నవయసులో మదర్ శిష్యురాలిగా చేరిన మేరీ జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని ఇలా తెలియజేశారు. 1968 మే 14వతేదీన మొట్టమొదటిసారి మదర్‌ను కలిశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. కేరళ నుంచి మేము రైలులో బయలుదేరి కలకత్తాకు 1968 మే 14న హౌరా స్టేషన్‌కు చేరుకొన్నాం. నాతో పాటు 20 మంది వచ్చారు. మదర్ నడిపే ఛారిటీ ట్రస్టుకు కొన్ని వస్తువులు ఇచ్చేందుకు వచ్చాం. ట్రైన్ దిగగానే ఎవరన్నా ట్రస్టు సభ్యులు వచ్చారా అని చుట్టూ చూశాం. తెల్లటి చీరలో నిర్మలమైన మోముతో మమ్మల్ని తీసుకువెళ్లటానికి మదర్ నిలబడి ఉన్నారు. ఆమెను చూడగానే ‘నమస్తే’ అని అన్నాం. కాని ఆమె మా అందరినీ ఆప్యాయంగా కౌగిలించుకుని స్వాగతం చెప్పారు. ఆ చేతుల్లో ఎంతో ప్రేమ దాగివుందని తెలిసింది.
ఆ క్షణంనుంచి సెయింట్ మేరీ జోషి మదర్ అనుచరురాలిగా మారిపోయారు. మదర్ ఛారిటీ ట్రస్టులో జాయిన్ అయిన అతి పిన్నవయస్కురాలు ఆమె కావటం గమనార్హం. ఆమె రిజిస్ట్రేషన్ నెంబర్ 373. జోషి కలకత్తా, ఢిల్లీ, ముంబాయిలలో పనిచేశారు. ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలపాటు మదర్‌తో కలిసి పనిచేశాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా రేయింబవళ్లు కష్టపడేవారు. ‘‘ఏ రోజు ఆమె విశ్రాంతి తీసుకున్నట్లుగా ఎరుగను. ఎంతో అంకితభావంతో సేవ చేసేవారు’’ అంటూ జోషి చిన్న కన్నీటి బొట్టును వదిలారు.
కుష్ఠురోగులను చూస్తే చాలు అసహ్యించుకుంటూ దూరంగా వెళ్లిపోతాం. కాని ఈ అమ్మ వారిని అక్కున చేర్చుకుని సేవ చేసేవారు. సేవా కార్యక్రమాల్లో ఉన్నపుడు అనారోగ్యానికి గురైతే వెంటనే మమ్మల్ని ఆమె మంచంపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు అని జోషి పేర్కొంది. మదర్‌కు 1979లో నోబుల్ బహుమతి లభించినపుడు భారత ప్రభుత్వం సన్మానించి, పెద్ద పార్టీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ హంగూ, ఆర్భాటాలను తిరస్కరించి దానికయ్యే వ్యయాన్ని చెక్కు రూపంలో తీసుకుని, ఆ డబ్బును చారిటీ ఫండ్‌లో కలిపారు. ఈ చిన్ని చిన్న జ్ఞాపకాలను మదిలో భద్రపరచుకుని వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని ఇంకా మరింత సేవ చేయటానికి శక్తిగా భావిస్తున్నానని జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తెలిపారు. ఇలా ఎంతోమంది ఆమె సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగాపొంది ఆమె సేవా సైన్యంలో చేరినవారు ఎందరో..
ఈ విశ్వాసానికి అమ్మగా మారిన ఈ 87 ఏళ్ళ సేవామూర్తి తన జీవితకాలంలో ఎంతోమంది శిష్యురాళ్లను తయారుచేసి అన్నార్తులకు, అనాథలకు అండగా వారి చెంత చేర్చింది.

‘అమ్మ’ ల పొదిలో....

‘తనయుని వీరునిగా తీర్చే తల్లిగా పుట్టించెను ఆ దేవుడు తనకు మారుగా’ అన్నాడో కవి. కుమారుణ్ణి వీరునిగా తీర్చేందుకు తల్లికి అన్ని విద్యలూ రాకపోయినా వాటిని గురించిన పరిజ్ఞానం అంతో ఇంతో ఉండాలి. ఇప్పుడు మాడ్రన్ మామ్‌లు అందుకే అన్నింటిని గురించి తెలుసుకుంటున్నారు. కాలానుగుణంగా మారుతున్నారు. ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ తరం. అందుకే మాడ్రన్ మామ్‌లు డిజి మామ్‌లవుతున్నారు. రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ తరం తల్లుల జీవనం కూడా పరివర్తన చెందుతోంది. జీవన విధానం మారుతోంది. పిల్లల్ని పెంచే పద్ధతీ మారుతోంది.
దంపతుల మధ్య పిల్లల రాకడ తల్లులను బిజీ చేస్తోంది. అయితే ఆధునిక ఉపకరణాలను, సాధనాలను ఉపయోగించడం వల్ల జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. మనం అట్టలపై ఫోటోలు అతికించే రోజుల నుంచి డిజిటల్ ఫోటోల స్థాయికి ఎదిగాం. పిల్లల పెంపకమైనా, షాపింగ్ కోసమైనా, సోషల్ నెట్‌వర్కింగ్ కోసమైనా ఇప్పుడు భారతీయ మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. భారత్‌లో చాలామంది ఆధునిక మహిళలను ప్రశ్నించగా ఇంటర్నెట్ ఇప్పుడు తమ జీవితంలో భాగమైందని చెప్పారు. దాదాపు సగం మంది గత నెలరోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేసినట్లు వెల్లడించారు. తమ తీరిక సమయంలో సగంకన్నా ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా పనులు చేసుకోవడానికి గాని, చదవడానికి గాని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు బ్రౌజింగ్ తమ హాబీగా మారిందని చెప్పిన వారూ ఉన్నారు. సింగపూర్, హాంకాంగ్, చైనా, కొరియాలతో పోల్చినప్పుడు భారత్‌లో గృహిణులు ఇంటర్నెట్ వినియోగించడం తక్కువే. అయితే మంచి బ్రాండ్ల గురించి, కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే బ్రౌజింగ్ తప్పనిసరి అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా డిజి మామ్‌లు చేస్తున్న పనే మీరూ చేయవచ్చు. ఇందుకు సరైన ఉపకరణాల వాడకం తప్పనిసరి. మంచి ఫోన్ వాడాలి. ఇప్పుడు సరికొత్త ఫోన్లతో సులభంగా, సత్వరంగా మెయిల్ చెక్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ వాడకమే కాక ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం నేర్చుకుంటే పిల్లలు అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వవచ్చు. ‘అమ్మా.. ఆక్టోపస్ అంటే ఏమిటి?’ ‘స్పేస్ షటిల్ ఎలా ఉంటుంది?’ ‘నువ్వు హిమాలయాలు చూశావా?’ వంటి ప్రశ్నలకు మీరు ఠకీమని బదులివ్వవచ్చు. మీరు ఏదో రైల్వేస్టేషన్‌లో ఉన్నారు. రైలు ఆలస్యమైంది. పిల్లలు సతాయిస్తున్నారు. అప్పుడు మీ ఫోన్‌లో వారికి ఇష్టమైన మంచి వీడియో క్లిప్పింగ్ ప్లే చేయండి. వెంటనే చిరునవ్వులు చిందిస్తారు. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు, ఫ్లిప్ కెమెరాలు రావడంతోప్రతి నెలా వందల సంఖ్యలో ఫోటోలు తీస్తుంటాం. వాటిని ఓ క్రమపద్ధతిలో ఫోల్డర్లుగా అమర్చుకుంటే ఎవరికైనా చూపడానికి, బంధువులకు మెయిల్ చేయడానికి అనువుగా ఉంటాయి. ఫొటోషేరింగ్ సైట్లు ఫ్లిక్కర్, పికాసా, కోడక్ గ్యాలరీలో అప్‌లోడ్ చేయడం ద్వారా బంధువులకు సులభంగా పంపవచ్చు. ఫ్లయ్ లేడీ డాట్ నెట్‌లో ఇచ్చే సూచనలు ఇంట్లో వస్తువులను ఓ క్రమపద్ధతిలో ఉంచుకునేందుకు తోడ్పడుతాయి. ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న డిజిటల్ వీడియో రికార్డర్‌తో పిల్లలు టీవీ చూసే సమయాన్ని తగ్గించవచ్చు. మంచి కార్యక్రమాలను, పిల్లలు ఇష్టపడే ప్రోగ్రామ్‌లను దానితో రికార్డు చేసి చూపవచ్చు. ఇక తల్లులు కాబోయే వారు గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లల పెంపకం గురించి తెలుసుకోవడానికి బోలెడు సైట్లు ఉన్నాయి.
కొనే్నళ్ళలో ఇంటర్నెట్ నిత్యావసర వస్తువుగా మారుతోందనే అభిప్రాయాన్ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ల అభివృద్ధి సంస్థ నివేదికలో పేర్కొన్నారు. డిజి మామ్‌లు పెరగడం వల్ల వారికి, వారి కుటుంబానికే కాక వ్యాపారవర్గాలకు కూడా లాభమే. వారు ఆన్‌లైన్ షాపింగ్ చేయడమే కాక తమ ఉత్పత్తులకు ఆన్‌లైన్ బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా పని చేస్తారని ఓ వాణిజ్య ప్రముఖుడు తెలిపారు. సో త్రీ చీర్స్ టు డిజి మామ్స్.

మనం సైతం.. మెరుగైన సమాజం కోసం


ఇప్పటి జీవితాలు ఎంత యాంత్రికం వేగవంతం అయ్యాయంటే పక్క ఇంట్లో ఉంటున్న వాళ్లెవరో తెలియనంత. తమ కుటుంబం బావుంటే చాలు. తాము బాగా సంపాదించి కుటుంబ సభ్యుల్ని సంతోషపెడితే చాలు. పక్కనున్న సమాజం ఏమైపోతే మనకేం అనే ధోరణి ప్రబలిపోతోంది. వ్యక్తిగత స్వార్థం మంచిదే. కానీ, సమాజంలో మంచి పౌరులుగా మనవంతు బాధ్యతను నెరవేర్చవలసిన అవసరం లేదా? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటే మెరుగైన సమాజం సాధ్యమవుతుందా? మా కష్టాలు మాకున్నాయి. మా జీవన పోరాటంతోనే మాకు సరిపోతుంది. సమాజాన్ని ఉద్ధరించటానికి మేమేం మహాత్మాగాంధీలం కాదు- అన్నీ వదిలేసుకున్న (సర్వసంగ) పరిత్యాగులం కాము అని వాదించే వాళ్లున్నారు. కుటుంబాన్ని వీధులపాలు చేసి సమాజం కోసం నడుం బిగించమని ఎవరూ చెప్పరు. ఒక మంచి తండ్రి/తల్లి ఒక మంచి భార్య/్భర్త, ఒక మంచి పొరుగువాడు, ఒక మంచి స్నేహితుడు... వీటి తర్వాత మంచి పౌరుడుగా గుర్తింపు పొందాలని చేసే ప్రయత్నం చేయమని చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఇందుకు మీ ఆస్తిపాస్తులను అనాధ శరణాలయాలకో, గుడులు గోపురాలకో దానం చేయనవసరం లేదు. మీకున్న దానిలో కొంత -మీ మనసుకు నచ్చినంత సమాజ సేవకు వెచ్చించవచ్చు. ఉదాహరణకు మీ పట్టణంలో అనాధ శరణాలయాలు ఉండవచ్చు. నిరుపేదలు చదువుకునే సాంఘిక సంక్షేమ హాస్టళ్లుండవచ్చు. వీధి బాలలను, బాల నేరస్తులను చేరదీసే స్వచ్ఛంద సంస్థలుండవచ్చు. ఇందుకు వీటిలో ఒకదానికి కొంత మొత్తాన్ని నెలనెలా కేటాయించవచ్చు. మీ బిడ్డల పుట్టిన రోజునో- మీ పెళ్లిరోజునో విందులు వినోదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోటాలకు తోడుగా ... ఇందులో ఏదోక చోటకు వెళ్లి కొద్దిసేపు వారితో గడపొచ్చు. పెన్నులు, పెన్సిళ్ల్లు, చాక్లెట్లు, నోట్ పుస్తకాలు వంటి బహుమతులు అందచేస్తే వారి కళ్లలో ఆనందాన్ని, తృప్తిని చూడొచ్చు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో వారిచ్చే బహుమతులకంటే ఇది ఎన్నో రెట్లు విలువైనది- మీ వ్యక్తిత్వాన్ని వనె్నలద్దేది అవుతుంది.
కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై ఎందరో వృద్ధులు ఓల్డేజి హోముల్లో మగ్గుతున్నారు. పండో ఫలమో, ఆధ్యాత్మిక పుస్తకమో అక్కడికి వారికి అందించి చూడండి. వాళ్ల జీవితంలో చేదును కొంతయినా తుడిచిన వారవుతారు. ఏడాదిలో ఒక్కసారయినా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. చలికి వణుకుతూ- వానకు తడుస్తూ ఎందరో నిరుపేదలు నడివీధిలో/ పార్కుల్లో ఆశ్రయం పొందుతున్నారు. కొంత ధనాన్ని వెచ్చించి ఇలాంటివారిలో కొందరికయినా దుప్పట్లో, రగ్గులో అందచేయవచ్చు.
వాడిపారేసిన ఆట వస్తువులు, పాఠ్యపుస్తకాలు, కామిక్ బుక్స్, ఇతర పుస్తకాలు పాత సామాన్లవారికి వేసే బదులు... వాటిని సొంతం చేసుకునే స్తోమత లేనివారికి అందచేయవచ్చు. రోజువారీ వృధాచేసే ఆహారాన్ని పేదలకు, బిచ్చగాళ్ల కడుపు నింపేందుకు ఉపయోగించవచ్చు. పట్టణాల్లో మురికివాడల్లోనూ, గ్రామాల్లో దూరంగా మసిలే పేదవారికి- వారానికి కొంత సమయం వెచ్చించి అక్షర జ్ఞానం కలిగించవచ్చు.
రెవెన్యూ, పోలీసు, కోర్టుల ప్రాంగణాల్లో తమ సమస్యలను అధికారులకు విన్నవించటానికి దరఖాస్తులు చేయడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి సహకరించే రిటైర్డు ఉద్యోగులు కొందరు- పరిశీలిస్తే మీకు కనిపిస్తారు. ఇలాంటివారికి మీరు తోడుకావచ్చు. కాలనీ సమస్యలు- అపార్టుమెంటులో సాధక బాధకాల పరిష్కారంలో భాగస్వాములు కావచ్చు. పర్యావరణ పరిరక్షణ- ఓటు హక్కు వినియోగం- ఓటరు నమోదు వంటి సామాజిక అంశాల్లో స్పృహను పెంచేందుకు చొరవ చూపొచ్చు. మీరు సొంత ఇంటివారయితే కొంత సమయాన్ని సత్సంగాలకు కేటాయించవచ్చు. చుట్టుప్రక్కల స్నేహితుల్ని ఇంటికి పిలిచి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు.
దేవాలయాల్లో పండుగలు, పర్వదినాలప్పుడు నిర్వహించే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములై సహాయ సహకారాలందించవచ్చు. వీధుల్లో చెత్తపోయటాన్ని నిరోధించటం, పార్కులు, పాదచారులు నడిచే రహదారులను శుభ్రంగా ఉంచటంలో చొరవ చూపవచ్చు.
మీరు విద్యా సంస్థల నిర్వాహకులయితే- ఆదివారాలు, ఇతర సెలవ దినాల్లో మీ ప్రాంగణాన్ని మంచి కార్యక్రమాల నిర్వహణకు వినియోగించవచ్చు. యోగా, ధ్యానం, పాఠ్యేతర అంశాల శిక్షణకు ఉచితంగా అందచేయటం ద్వారా ఔన్నత్యం పెంచవచ్చు. వ్యాపార సంస్థల్లో- పౌర స్పృహను పెంచే నినాదాలను ఉంచవచ్చు. విజయవంతమైన స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రచారం చేయటం ద్వారా ఇతరులకు వాటిపైన ఆసక్తిని కలిగించవచ్చు.
‘నేను సైతం...’ అన్న తీరులో వ్యక్తిగతంగా మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, లాభాపేక్షకు దూరంగా ఏ కార్యక్రమమైనా చేపట్టవచ్చు. మెరుగైన సమాజం కోసం మీ వంతు బాధ్యతను నెరవేరవచ్చు. ఒక్కసారి ఆలోచించండి.

బుధవారం, ఆగస్టు 24

తల్లీ కూతుళ్ళ బంధం మధురమైన అనుబంధం


ఆడపిల్ల మీద అంత ప్రేమ మక్కువ ఉండటంతో తల్లి స్వార్థం కూడా ఉంది. ఆడపిల్ల ఎప్పటికైనా మరోఇంటికి వెళ్ళాల్సిందే. అంటే తన ఇంటినుంచి మంచిని తీసుకెళ్ళేదే అమ్మాయి. అత్తవారింట్లో ఆ అమ్మాయి ప్రవర్తనను బట్టి తల్లికి మంచి లేదా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తనకు మంచి పేరు తెచ్చేలా అమ్మాయిని పెంచాలనే ప్రయత్నంలో తల్లి కనిపిస్తుంది. పైగా ఆడపిల్లలకు తల్లిఅవసరం చాలా ఎక్కువ. జడ వేసుకోవడం, అలంకరించుకోవడం వంటి వాటికోసం ఆరంభంలో తల్లి మీద ఆధారపడతారు. ఆ తర్వాత తల్లి నుండి నేర్చుకుంటారు. వయస్సుతో శరీరంలో వచ్చే మార్పులు, వాటికి ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటివన్నీ తల్లి మాత్రమే చెప్పగలదు.అందుకే తల్లి ఆడపిల్లతో ఎక్కువ సమయం గడుపుతుంది. తల్లి, తన బిడ్డ ప్రతి కదలికను తెలుసుకుంటుంది.
టీనేజ్‌లోకి వచ్చేంతవరకు తల్లి చూపే ప్రేమ, ఆదరణ అందుకొనే అమ్మాయిలు ఆ తర్వాత తమకు తగినంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని తల్లిమీద ఫిర్యాదు చేయడం మొదలుపెడతారు. అంతకుముందువరకు తల్లి చెప్పిన జాగ్రత్తలు టీనేజ్ అమ్మాయిలకు అర్ధంపర్ధంలేని అంశాలుగా కనిపిస్తాయి. తనను ఇంకా చిన్నపిల్లలా చూడటం చిరాకుకలిగిస్తుంది. అప్పటివరకూ అమ్మ మాట ప్రకారం చిన్నవాడైన తమ్ముడ్ని తోడు తీసుకొని బయటకెళ్ళని అమ్మాయిలు టీనేజ్‌లోకి ప్రవేశించగానే ఇంట్లోవాళ్ళ తోడుతో బయటకు వెళ్ళడం ఏదో చిన్నతనంగా భావిస్తారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, సమయానికి ఇంటికి రావాలని, ఇంటి పనులు నేర్చుకోవాలని తల్లి చెప్పే ప్రతి మాట అర్ధంలేనిదిగా ఉండి చిరాకు తెప్పిస్తుంది. దీనితో అమ్మ చెప్పిన మాట వినకపోవడం, ఎదురు సమాధానం చెప్పడం ప్రారంభిస్తారు. అదుపు తప్పుతుందన్న భావం తల్లిలోనూ, తనమీద అనవసర అనుమానం పెంచుకుంటుందన్న ఆలోచన అమ్మాయిలోనూ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి కుటుంబ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తుంది. ఎంత త్వరగా ఇల్లు వదిలి వెళ్ళిపోదామా అన్న ఆలోచన అమ్మాయిలో కలుగుతుంది. ఇంటి దగ్గర అందని ప్రేమ, ఆదరణ మరోచోట పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలోనే గాడి తప్పుతారు. ఇలాంటప్పుడు తల్లే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలు చెడుమార్గంలో పయనిస్తున్నప్పుడు ప్రేమాభిమానంతో నచ్చచెబుతూ సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిపైనే ఉంది. అమ్మాయిని ఎప్పుడూ చిన్నపిల్లలానే చూడకూడదు. వారి వయస్సుకు తగ్గట్టు, సమాజం, వాతావరణం అనుగుణంగా నడుచుకోవాలి.
ఆడపిల్లలకే కాదు మగ పిల్లలు కూడా ఇంటి పనులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్న సమయం ఇది. మగవారికి అన్ని పనులు వచ్చినా నేటికీ ఇంటి బాధ్యత స్ర్తిలదే. వంట చేయడం, ఇంటిని చక్కదిద్దుకోవడం అనాదిగా వస్తున్నది. నిజానికి ఈ రెంటిమీది హక్కును వదులుకునేందుకు అమ్మాయిలు సిద్ధంకారు. కూతురుమీద తల్లిప్రేమ అవసరమే. అయితే గుడ్డి ప్రేమ కాకూడదు. తమ నిర్ణయమే నెత్తిన రుద్దే తల్లులకు ఆడపిల్లలు నెమ్మదిగా దూరం అవుతారని గ్రహించాలి. కూతురుకు నేర్పు, ఓర్పు నేర్పాల్సిన బాధ్యత తల్లిదే. వీటిల్లో కూతురు అండగా నిలవటం అవసరమే. అయితే ఆ అండ పరిధిని దాటి ఉండకూడదు.
ఒకసారి అమ్మాయి ప్రవర్తన గాడితప్పితే సరిదిద్దడం కష్టం. ఆడపిల్ల పెంపకంలోని లోపానికి తల్లినే తప్పుపడతారు. కాబట్టి తన బిడ్డ అని నలుగురిలో గర్వంగా చెప్పుకోవాలంటే అన్నింటిలో పరిమితి అవసరం. నిజానికి ఆడపిల్లకు తల్లికి మించిన స్నేహితురాలు ఉండదు. ప్రతి విషయం మనసు విప్పి తల్లికి చెప్పుకుంటుంది. ఆ మాటలను బట్టి తల్లి ఎదుగుతున్న పిల్లలకు మార్గదర్శకం కావాలే గాని చేయి పట్టుకు నడిపించకూడదు. తల్లీకూతుళ్ళ బంధం ఒక తరహాకి చెందిందని చెప్పలేం. ఎన్నో అంశాలలో ఇద్దరికీ అవసరాలు ఉంటాయి. తల్లి కూడా తన కష్టాలను కూతురితోనే పంచుకోగలుగుతుంది. తల్లిని కుమారులు ఎంత ఆదరిస్తున్నా, కూతురు చూపించే ప్రేమానురాగాలకు ముగ్ధురాలవుతుంది. అటువంటి అద్భుతమైన తల్లీ కూతుళ్ళ బంధం అందంగా వికసించాలి. ‘‘నన్ను పెంచిన తల్లి’’ అని కూతురు, ‘నాకన్న కూతురు’ అని తల్లి సగర్వంగా చెప్పుకునేలా వారి అనుబంధం పెరగాలి.

అమ్మ కు కడుపుకోత తప్పేదెలా..?

అమ్మ అనిపించుకున్నప్పుడే స్ర్తి జన్మకు సార్థకత. దానికోసం ప్రతి స్ర్తి తపిస్తుంది, తపస్సు చేస్తుంది. కాని అమ్మ పడే ప్రసవ వేదన ఆమెకు మరో జన్మతో సమానం. అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. తాను నిర్ణయించుకున్న ముహూర్తానికే బిడ్డను కనాలని 3సిజేరియన్2కి సైతం సిద్ధపడుతుంది. మంచి ఘడియల్లో పుట్టే బిడ్డ మంచి పేరు తీసుకువస్తాడని ఆరాటపడుతుంది. ప్రస్తుతం 65 శాతం మంది సిజేరియన్‌ల గాటుకి గురికాబడే బిడ్డకు జన్మనిస్తున్నారు. దీనికి కారణం డాక్టర్లు అని కొందరంటే, గర్భం ధరించిన తరువాత జాగ్రత్తలు తీసుకోకపోవడమని మరికొందరంటారు. ఏదేమైనా సిజేరియన్ పడనిదే బిడ్డ బయట ప్రపంచాన్ని చూడడంలేదు. ఈ పరంపరలో తల్లీ బిడ్డలకు లేదా ఎవరికో ఒకరికి ప్రమాదం ఏర్పడే సందర్భాలు లేకపోలేదు. అలాంటప్పుడు హాస్పిటల్‌పై పేషెంట్ బాధితులు దాడి చేయడం కూడా జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అతిగా అభివృద్ధి చెందడంవలన మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుందనడంలో సందేహమే లేదు. పిండదశలోనే ఆడపిల్లలు హత్యకు గురైపోతున్నారంటే (భ్రూణహత్యలు) దానికి కారణం స్కానింగ్ ప్రక్రియ. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా అమలులో మాత్రం అంతంత మాత్రంగానే వున్నాయి. పుట్టే బిడ్డ సంగతి ముందే తెలిసిపోవడంతో అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన సిజేరియన్‌ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. స్ర్తి గర్భం ధరించిన నాటినుండి సరైన పోషకాహారంతోపాటు గైనకాలజిస్టు సలహాతో ఎక్సర్‌సైజులు చేస్తే సులభమైన ప్రసవాన్ని పొందవచ్చును. ఇంతకుముందు ప్రసవాలన్నీ మంత్రసాని సహాయంతోనే జరిగేవి. సిజేరియన్ అంటే 3హమ్మో!2 అనేవారు. దానికి కారణం ఆ రోజుల్లో ప్రసవానికి ముందు తరువాత తీసుకునే ఆహారంతోపాటు గర్భం దాల్చినప్పటికీ సాధారణ స్ర్తిలాగే పనిపాటలు చేసుకోవడం జరిగేది. వీటివలన గంపెడు పిల్లలనైనా కత్తిగాటు పడకుండా కనేసేవారు.
ఇప్పుడు ఆహారపు అలవాట్లు, వాడే మందుల ప్రభావం, అతి జాగ్రత్తవలన డాక్టర్ పెట్టిన ముహూర్తానికే ప్రసవం జరుగుతుంది. ప్రసవ తేదీని ముందుగానే నిర్ణయించిన డాక్టర్ ఆ సమయానికి సిజేరియన్ చేసేసి బిడ్డను బయటపడేస్తున్నాడు. స్ర్తిలు కూడా మంచి ఘడియలు, నక్షత్రం, రోజు చూసుకుని మరీ సిజేరియన్‌కి సిద్ధపడుతున్నారు. అంతేకాక సిజేరియన్ మార్క్స్ పడకుండా వుండడానికి స్టిక్కరింగ్‌టైపు సిజేరియన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేటి స్ర్తిలు ప్రసవంవలన తన పొత్తికడుపు సౌందర్యం దెబ్బతినకూడదని భావిస్తున్నారు. ఆరోగ్య పరిశోధనల్లో సిజేరియన్ వలన అటు బిడ్డకు ఇటు తల్లికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందని తెలిసినా నేటి తల్లికి ఈ గాటు తప్పడంలేదు. సిజేరియన్‌లు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పాలిట కల్పవృక్షమే.
మరి ఈ రోజుల్లో కూడా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయంటే దానికి కారణం గర్భిణీ స్ర్తిల ఆహారపు అలవాట్లు, దైనందిన కార్యకలాపాల పట్ల చురుకుగా పాల్గొనడమే. సంచార జీవులు, పేదవారిలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు వస్తున్నాయంటే కారణం ఇదే. సుఖ ప్రసవానికి సౌకర్యాలకంటే సాధారణ ప్రవర్తనే ముఖ్యం.

ఆయువు పెంచే అమ్మ పాలు


ప్రతి స్ర్తి అమ్మగా తన జన్మ పండించుకోవాలని ఆరాటపడుతుంది. తాను అమ్మగా మారానన్న సమయంనుండి తన గర్భంలో పెరుగుతున్న పిండాన్ని అపురూపంగా కాపుకాసి పెంచుకుంటుంది. ప్రసవానంతరం బిడ్డకు పాలిచ్చి ఆయువును పెంచుతుంది. అమ్మ పాలను బిడ్డ త్రాగడంవలన దీర్ఘ సమయానికి అవసరమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అందుకే తల్లిపాలను ఎక్కువగా సేవించిన పిల్లలు ఆరోగ్యంగానూ, దీర్ఘాయువుగానూ ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
బిడ్డ తల్లిలో అంతర్భాగం. గర్భావధికాలంలో తల్లిద్వారానే ఆహారం, చిరాయువును పొందినప్పటికీ భూమిమీదపడిన తరువాత కూడా తల్లి ఆహారం ద్వారా లభించే పాలుయే బిడ్డ ఆయువును పెంచుతాయి. గర్భిణీగా వున్న సమయంలో తల్లి తీసుకున్న పోషక విలువలు గల ఆహారము ఎంతగా బిడ్డకు ఉపయోగపడిందో, బిడ్డ జన్మించిన తరువాత తల్లి తీసుకునే ఆహారం కూడా అంతగానే ఉపయోగపడుతుంది. అందుకే తల్లి ప్రసవానంతరం చాలాకాలం పత్యము పేరుతో ఆహారము తీసుకోవడం జరుగుతుంది. పొరపాటున రుచికోసం వేరే ఆహారం తీసుకుంటే అది బిడ్డ పాలు సేవించిన తరువాత బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే బిడ్డ తల్లిపాలు సేవించే కాలమంతా మంచి ఆహారం తీసుకోవడం తల్లీ బిడ్డలకు శ్రేయస్కరం.
బిడ్డకు జన్మనిచ్చిన తరువాత స్రావాలతో నిండిన ‘మురిపాలు’ బిడ్డ సేవించకుండా దూరమైనా, గర్భస్రావం జరిగిన సందర్భాలలో ఆమె నరకయాతన అనుభవిస్తుంది. కొంతమంది స్ర్తిలలో పాలిండ్లు నిండక పాలకొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు బిడ్డ ఆదిలోనే పోత పాలకు అలవాటుపడాల్సి వస్తుంది. అందుకే ముద్దు మరిపాలు అన్నారు.
బిడ్డకు సాధారణంగా 5-6 నెలల వరకు తల్లిపాలు సేవించే అలవాటు ఉంటుంది. ఆపై తల్లియొక్క అభిరుచిపై కొంతమంది పిల్లలు దాదాపు సంవత్సరం వరకు కూడా పాలను సేవిస్తారు. పరిశోధనలు, డాక్టర్ల అభిప్రాయంలో ‘బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ మిల్క్ పర్ చైల్డ్’ అనేది తేలింది. కాని నేటి స్ర్తిలలో పిల్లలకు పాలిచ్చే అభిరుచి, తీరిక నానాటికీ తగ్గిపోతుంది. దానికి ప్రధానంగా స్ర్తిలకు అందంపై వుండే మక్కువ, వర్కింగ్ ఉమెన్స్‌గా వుండడం కనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్‌కి ‘మెటర్నటీ లీవ్’ ప్రభుత్వ కొలువులో దొరికినంతగా ప్రైవేట్ కొలువులో దొరకదు. దానితో పూర్తిగా బిడ్డను సాకకుండా డబ్బా పాలకు బిడ్డను బానిసను చేస్తుంది.
అందం విషయానికి వస్తే స్ర్తిలు వక్ష సౌందర్యానికి కూడా విలువనిస్తారు. బిడ్డకు అతిగా పాలివ్వడంవలన పాలిండ్లు జారిపోతాయని, మెత్తబడిపోతాయని భావిస్తారు. నిజానికి బిడ్డకు పాలివ్వడం ద్వారా చాలా ఆనందం పొందుతుంది. తద్వారా ఆమె ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడతాయి. సరైన లోదుస్తులు ధరించడం, సక్రమమైన వ్యాయామం చేయడం ద్వారా తిరిగి వక్ష సౌందర్యాన్ని పెంచుకోవచ్చునని తెలిసినా బిడ్డకు పాలివ్వడంలో అయిష్టత చూపుతారు. కేవలం 2-3 నెలల వరకు పాలిచ్చినా తదుపరి అనేక రకాల మార్కెట్ పాల ఉత్పత్తులకు బిడ్డను బానిసను చేస్తారు.
బిడ్డకు పాలివ్వడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోకూడదు. ఆందోళనకరమైన విషయాలను వింటూ, చూస్తూ (టివీల్లో) పాలివ్వడం వలన ఆమె హృదయ స్పందనారీతులు బిడ్డపై ప్రభావం చూపుతాయి. వర్కింగ్ ఉమెన్స్ సమయం లేకపోవడంవలన ఒకవైపు బిడ్డకు పాలిస్తూనే మరోవైపు ఆఫీసు వర్కు చేస్తుంటారు. దీనివలన బిడ్డ తల్లి పొత్తిళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తగిన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిటారుగా కూర్చుని పాలిచ్చే ప్రక్రియ చేయడం తల్లీ బిడ్డలకు క్షేమదాయకం. బిడ్డను కని అమ్మ అనిపించుకోవడం కంటే ఆయువును పెంచే పాలను అందించడంలోనే అమ్మకు తృప్తి, అందం, ఆనందం ఉంటుందనేది స్ర్తిమూర్తికి తెలియనిదికాదు.

సంతానం స్ర్తికి వరమా? శాపమా

ఈనాటి నూతన దంపతులలో పెళ్లి అయి ఏడెనిమిది ఏళ్లు అయినా ఇంకా సంతానం కలగకుండా ఉన్న జంటలను మనం తరచుగానే, ముఖ్యంగా నగర ప్రాంతాలలోనే చూస్తూ వుంటాం. వారిలో ఎవ్వరైనా మనకు కొద్దిగా సన్నిహితులు అయితే వారేమైనా ‘్ఫమిలీ ప్లానింగ్’ పాటిస్తున్నారేమో. అందువల్లనే పిల్లలు కలగడం ఆలస్యం అయిందేమోనని భావిస్తూ- అయినా నిజమేమిటో వారి నోటినుండే తెలుసుకోవాలని ఉబలాటపడతాం. అయితే వారు చెప్పే సమాధానం మనకు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘అబ్బే! ప్లానింగ్ ఏమీలేదండీ- ఎందుకనో ఇప్పటివరకూ పిల్లలు కలగలేదు, అంతే’ అన్నప్పుడు.
నిజానికి ఈ విస్తృత సమాజంలో వివాహం జరిగాక రెండు లేక మూడు సంవత్సరాలుగా తల్లి కాలేకపోతే అది ఆమెలోగానీ ఆమె భర్తలోగాని ఉన్న శారీరక లోపం ఏమోనని భావిస్తూ, నిర్థారిస్తూ నిరాశ, నిస్పృహలకు లోనై ఎంతగానో కృంగిపోతూ ఉండడం జరుగుతుంది. అట్టి దంపతులు పొందే ఆవేదన అంతా ఇంతా అని చెప్పడానికి అలవికాకుండా ఉంటుంది.
ఇలా నూతన వివాహితులు మిగతా అందరిలాగా రెండు మూడేళ్లలోగా గర్భం ధరిచలేకపోవడానికి కారణాలు చాలా ఉండవచ్చు. వీటిలో అతి ముఖ్యమైన కారణం- వీరి భర్తలు హెచ్చు జీతాలమీద పెద్ద ఉద్యోగాలమీద తీవ్రమైన ఆశతో విశ్రాంతిని కోల్పోతూ హెచ్చుగంటలు ఉద్యోగ బాధ్యతలూ అదనపు బాధ్యతలూ నిర్వరిస్తూ ఉండడం. ఇంటికి వచ్చేసరికి శారీరకంగానూ మానసికంగానూ అలసిపోతూ ఉండడం. కొన్ని సందర్భాలలో పని ఒత్తిడికి తట్టుకోవడానికై ధూమపానం చేస్తూ ఉండడం, మద్యం సేవిస్తూ ఉండడం. అలాగే ఉద్యోగ బాధ్యతలతో విశ్రాంతి కోల్పోటం, స్ర్తిలకు గర్భాశయంలో లోపాలు ఏర్పడుట ఉండడం కూడా ఇందుకు కారణం అవుతుంది. వైద్య పరీక్షలు చేయించుకుంటే లోపం ఎక్కడ ఉన్నదో, ఎవరిలో ఉన్నదో సరిగా తెలుసుకొనలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
ఇలా గర్భధారణలో లోపానికీ, జాప్యానికీ గురి అవుతున్నవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మేరకు ఉండవచ్చునని ప్రముఖ వైద్య సంస్థలు నిర్వహించిన సర్వేద్వారా తెలియవస్తున్నది.
స్ర్తిలకు 30 ఏళ్ల వయస్సుదాటిన తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ వయసులోగానీ సంతానం పొందే ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం అని ప్రాచీన సంప్రదాయాలవల్ల, వైద్య నిపుణుల సలహాలవల్లా తెలియవస్తున్నది.
ఇలా సంతానాన్ని పొందలేకపోతే మాత్రం ఇకపై ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనేక సాంప్రదాయిక, మానసిక ఒత్తిడుల కారణంగా, క్షీణించక తప్పని పరిస్థితి ఏర్పడి, ఇందుకు కారణం ఎదుటివారిలోని శారీరక, మానసిక లోపాలను భార్యాభర్తలు పరస్పరం నిందించుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకొనడం జరుగుతూ ఉంటుంది.
ఈ పరిస్థితి రాకుండా నిరోధించేందుకు మార్గాలు మనకు చాలానే కావస్తాయి. మనం, అంటే భార్యాభర్తలు, ఈ గర్భధారణకు, సంతాన ప్రాప్తికి అవరోధం కలిగించే ఏయే పనులు చేస్తున్నారో, వాటిని స్వయంగా పరిశోధించి తెలుసుకుని ఆ లోపాలు సమూలంగా తొలగించివేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం- మొట్టమొదటగా చేయవలసిన పని. ఇక తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో పరిశీలిద్దాం.
-స్ర్తి గర్భధారణ కార్యక్రమం అంతా పురుషుని వీర్యబలం మీదనే అతి హెచ్చుగా ఆధారపడి ఉంటుంది. మద్యపానం, ధూమపానం పురుష వీర్యాన్ని పలచబడేట్టు చేసి శక్తిలేకుండా చేస్తాయి కాబట్టి వాటిని ఎంత త్వరగా మానివేయగలిగితే అంత త్వరగా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు.
-్భర్యాభర్తల మధ్య ప్రధానంగా పెరగవలసింది పరస్పర అనురాగం, సాంగత్యం. పిల్లలకోసమే దగ్గర కావడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. పరస్పరం శరీర సంపర్కాన్నిపొంది ఆనందించగల్గడం సహజమైన కార్యక్రమంగా మారాలి.
-్భర్యాభర్తలలో ఏ ఒక్కరూ విశ్రాంతి లేని రకరకాల పనులతో తలమునకలై ఉండిపోవడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రతి రోజులోను ఒకటి రెండు గంటలసేపు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా కాలం గడిపి ఆనందించే ఏర్పాటు తప్పనిసరిగా చేసుకోవాలి.
-కొత్త దంపతులు మంచి సంతానం పొందడానికి ఉభయులూ మంచి ఆరోగ్యవంతులై ఉండడం తప్పనిసరి. వ్యాయామం, ఆసనాలు, యోగాలాంటి మంచి అలవాట్లు పాటించాలి.
-ఒక్కొక్కప్పుడు జన్యు సంబంధమైన అనే కారణాలవల్ల సంతానం కలగడం కొంత ఆలస్యం కావచ్చు. కాని అట్టి పరిస్థితులలో నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో తగు వైద్య చికిత్సలు పొందితే సత్ఫలితాలుంటాయి.
-్భర్యాభర్తలమధ్య పరస్పర శారీరక ఆకర్షణ, మానసిక అవగాహన లోపిస్తే ఇక వారి మధ్య పరస్పర అనురాగం, అనుబంధం, సుఖవంతమైన సహజీవనం సాధ్యం కావు. ఈ పరిస్థితులు ఎవరికివారు ఏవేవో అనవసర బాధ్యతలు నెత్తిన వేసుకోవడవంల్ల, ఏవేవో అర్థంలేని భయాలకు లోనవుతూ ఉండడంవల్ల ఎదురు అవుతుంటాయి. ఈ స్థితి నుండి బయటపడడానికి మార్గం- కాస్తంత నోటికీ, ముక్కుకూ చురుక్కుమనిపించే రెండు ఔషధ పదార్థాల వినియోగం. ఆ రెండు పదార్థాలూ ఏమిటంటే ఉల్లిపాయలు, అల్లం.
-్భర్యాభర్తలు తమ శరీరాలూ, ప్రవర్తన పరస్పర ఆకర్షణీయాలుగా ఉండేట్లు చేసుకొనడంలో తమ పడకగదిని అందంగా ఉండేట్లు అమర్చుకొనడం, మల్లెపూల సువాసన, గులాబీల ఆకర్షణ, అగరువత్తుల సుగంధం గుబాళింపు సెక్స్‌పట్ల ఆసక్తిని పెంచుతాయి. భార్యాభర్తలమధ్య పరస్పర స్నేహభావం, చనువు ఉండాలి. ఏవిషయంలోనైనా ఒకరికి కోపం వస్తే రెండవ వారు తగ్గిపోయి క్షమాపణ చెప్పుకోగలగాలి. భర్త పట్ల భార్యకు చనువు, సాన్నిహిత్యం ఏర్పడకపోతే సంతానం కలగడం కష్టం. కలిగినా ఆ సంతానం అదనపు బాధ్యతలకు, దుఃఖానికీ దారితీస్తుంది తప్ప సుఖాన్ని కలిగించదు. అందువల్ల పురుషుల అధికార దర్పాన్ని అదుపులో ఉంచుకొనడం అవసరం. అలాగే వీటికితోడు తగినంత విశ్రాంతి, నిద్రకూడా అవసరం.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నవారికి బలమైన, ఆనందకరమైన సంతానం కలుగుతుంది అని చెప్పడంలో సందేహం అక్కరలేదు.
అయితే సంతానం పొందడం, పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేయడం విషయంలో పురుషుని పాత్ర చాలా స్వల్పం. స్ర్తి పాత్ర చాలా అధికం కావడంవల్ల అసలు ఈ మాతృత్వం స్ర్తికి వరమా? శాపమా? అనే సందేహం చాలా మంది స్ర్తిలకే కాక పురుషులకు కూడా రావచ్చు.
నిజమే. గర్భధారణ జరిగిన నాటినుండి స్ర్తి తొమ్మిది నెలలపాటు పడే పాట్లు, ప్రసవకాలంలో పడే బాధ ఆ తర్వాత పిల్లలకు పాల్వివడం, వారి ఆలనా పాలనా- ఇదంతా ఒక మహాతపస్సు అని ఎవరైనా అంగీకరించవచ్చు.
అందువల్లనే ప్రతి వ్యక్తీ ‘అమ్మ’ ముందు తలవంచి ఆమె నుండి శుభాశీస్సులకై ఎదురుచూసే అసామాన్య పరిస్థితి, అనూహ్య గౌరవ స్థితి ఒక స్ర్తికి మాత్రమే లభిస్తున్నది. ‘తల్లి’కి మించిన దైవమే ఎక్కడా లేదని అందరూ విశ్వసించడం జరుగుతున్నది. ఈ అసామాన్య గౌరవ స్థితి వరమో, శాపమో స్ర్తిలే నిర్ణయించుకొనవలసి యున్నది.

గురువారం, ఆగస్టు 4

అమ్మ



అడ్డంకులు తొలగించే ‘అమ్మ’ కొడుకు


అగ్రపూజలందుకునే ఆదిదేవుడు వినాయకుడు. తొలి పూజలందుకునే గణేశుడిని గణానంత్వా గణపతిగ్‌ంహవామహే అని ఋగ్వేదం చెప్తోంది. ‘గ’ అనే అక్షరం జ్ఞానాన్ని తెలియచేస్తే ‘ణ’ నిర్వాణం చెప్తుంది. అందుకే గణ నాయకుడైన గణపతి జ్ఞాన నిర్వాణ శాసకుడయ్యాడు. వినాయకుడిని ఇంద్రుడు పూజించి గౌతమమహార్షిశాపాన్నుంచి విముక్తుడయ్యాడు. గణపతి అర్చన తర్వాత క్షీరసాగరమధనం నిర్వర్నిఘ్నంగా సాగిందంటారు. గాయత్రి మంత్రంలాగే ముప్పైరెండు అక్షరాలున్న శుక్లాంబరధరం మహామంత్రం. ‘గం’ ‘గ్లౌం’ అనే బీజాక్షరాలు విఘ్ననాయకునివి. విగతో నాయకః వినాయక సర్వస్వతంత్రుడైన వినాయకుడు ప్రధమ గణాలకే కాక మానవదేహంలోని మూలాధార స్థానానికి కూడా అధిపతే. గణపతిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. జీవితంలో వక్రాలను తొలగించేవాడుకనక వక్రతుండాయ అని, దీనపాలకుడు గనుక హేరంబాయా అని స్తుతిస్తారు.
పార్వతీదేవి ముద్దులు మూటలుగట్టే కుమారుణ్ణి చూసి మురిసిపోయింది. ఆ కుమారుణ్ణే ప్రధమగణాలకు అధిపతిచేయమని అంటే భూలోకప్రదక్షిణలు చేయాలని షరతు పెట్టాడు పరమశివుడు. కుమారస్వామి పుణ్యనదీస్థానానికి బయలుదేరితే లంబోదరుడు తల్లితండ్రుల చుట్టు ప్రదక్షణ చేసాడు. కుమారస్వామికి తనకన్నా ముందుగానే స్నానమాచరించే వక్రతుండుడు కనిపించేవాడు. ఆశ్చర్యానందాలకు లోనైన కుమారుడు విషయాన్ని తెలుసుకోవడానికి వస్తే తల్లి తండ్రుల ఎదుట తన కన్నా ముందే ఉన్న వెనకయ్య చిరునవ్వుతో స్వాగతం చెప్పాడు. సుబ్రమణ్యేశ్వరుడు శూర్పకర్ణుని సంగతిని తెలుసుకొని నమస్కరించాడు. ప్రథమగణాలకు అధిపతిని చేసి విశ్వనాయకుణ్ణి చేసారు. భక్తుల సకలకార్యసిద్ధిని చేసి వరసిద్ధివినాయకుడు అయ్యాడు. షోడశోపచారాలు చేస్తున్నవినాయకుడు భక్తుల కోరిక మేరకు ద్వాదశరూపాల్లో కనిపించి కరుణచూపిస్తాడు. అలాంటి వినాయకుణ్ణి భక్తులు దీక్షవహించి పూజించి తరిస్తారు.
కాజీపేటలో స్వయంభూగా అవతరించిన శే్వతార్కగణపతిని మండలదీక్షతో ఆరాధిస్తారు. సంవత్సరానికి రెండుసార్లు గణపతి దీక్షను తీసుకొని భక్తులు హైద్రాబాదుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే వరంగల్లు జిల్లాలోని విష్ణుపురిలో కొలువైన వినాయకుణ్ణి పూజిస్తారు.
భాద్రపద శుద్దచవితినాడు వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములను పెట్టి 21రకాల పత్ర పుష్పాలతో పూజిస్తారు. ఆరోజే శే్వతార్కగణపతి ముందు మండల దీక్ష తీసుకుని మాలధారణ చేస్తారు. ఇలా మాలధారణ చేసే స్వాములు గణపుతి ప్రతిరూపాలుగా సంభావిస్తారు. మాలధారణ చేసినవారు సంకల్పసిద్ధికోసం పదకొండుమార్లు ఓ గం గణపతయే నమః అంటూ జపిస్తారు. ఈ మాలధారణ చేసినవారు శే్వత వస్త్రాలను ధరిస్తారు. పూజామందిరంలో గణపతి విగ్రహాన్ని పెట్టుకుని అలంకరించి దానిముందు పసుపు గణపతిని చేసి విఘ్ననాశనాన్ని చేయుమని వేడుకొంటారు. త్రికాలాలలోనూ గణపతి ఆరాధిస్తూ ఎవరినీ నొప్పించకుండా వారు నొవ్వకుండా ఉంటారు. ఆ మృణ్మయ వినాయకుణ్ణినియమనిష్ఠలతో పూజిస్తూ మండలంరోజులు ఎదుటి వారిని విశ్వనాయకుడి నామాలతో పిలుస్తూ. దీక్షనుపూర్తిచేస్తారు. మండలం చివరిరోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు. మరికొందరు శ్రావణ శుద్ద చవితి నుంచి మండలదీక్షలు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి నాడు దీక్షను విరమిస్తారు. విరమణానంతరం జపహోమాదులతో పాటుగా అన్నదానాన్ని కూడా చేసి వినాయకుడిని సంతృప్తి పరుస్తారు. దీక్షాకాలంలో సాయంసంధ్యలలో గణేశభజన చేస్తారు. ఇలా చేసిన వారిని అఖండ ఐశ్వర్యాదులతో అనుకొన్న పనులు విఘ్నాలు లేకుండా జరిగేలా వినాయకుడు అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.
వినాయకుణ్ణి పూజించే పత్రిలో ఓషధీగుణాలున్నాయ. అవి ఈ మాసంలో ఉపయోగించడంతో మానవుల ఆరోగ్యానికి విశేష ఫలం దొరుకుతుంది. అందుకే ఈ ప్రతాలన్నింటిచేత పూజించిన వారిని పార్వతి పుత్రుడు పూర్ణాయువుకమ్మని దీవిస్తాడు. లంబోదరా లకుమికరా అని సంగీత ప్రియుడైన లకుమివీణాధారుడిని పూజిస్తారు.

జీవాత్మ విభువా? అణువా?


దేవ, మనుష్య, పశు, పక్ష్యాదుల రూపంలో జీవులు అనేకులై ఉన్నారు. జీవాత్మ విభువే అంటే అంతటా వ్యాపించి ఉండే వాడే అని కొందరంటారు. కాదు జీవాత్మ ఒక చోట ఉండే సూక్ష్మ వస్తువే అణువే అని కొందరంటారు. 'ఏ షోణురాత్మా చేత సావేదితవ్యః' ఈ అణువైన ఆత్మ మనస్సుచే తెలుసుకొనదగినవాడు అని ముండకోపనిషత్ వాక్యం. 'వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్యచ భాగో జీవ సవిజ్ఞేయః' తోకగల వరిగింజ తోకలోని కొనను నూరు భాగాలు చేసి, అందులో ఒక భాగాన్ని తిరిగి నూరు భాగాలు చేసిన వానిలో ఒక భాగమంటే జీవాత్మ స్వరూపం ఉంటుందని శ్వేతాశ్వ చర ఉపనిషత్తు(5-9-8)వివరిస్తున్నది. 'ఆరాగ్రమాత్రో' - ఒక సూది మొన పరిమాణంలో ఆత్మ ఉంటుందట. ఆ అణువంత ఆత్మ, దేహమంతా సుఖదుఃఖాదులనెలా అనుభవిస్తుంది? అంటే దీపం ఒక ఇంటిలో ఒక చోట ఉన్నా దాని కాంతి ఇల్లంతా వ్యాపించినట్లు ఆత్మ గుణమగు జ్ఞానం దేహమంతా వ్యాపించి, అనుభవాలను ఇస్తుందని బృహదారణ్య కోపనిషత్తు వాక్యం.

వర్జీనియా బాధిత విద్యార్థుల కోసం నేడే తానా ప్రత్యేక సమావేశం

వర్జీనియా విశ్వవిద్యాలయ విద్యార్థులకోసం శుక్రవారంనాడు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి విద్యార్థులు అందరూ హాజరు కావాలని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో భారత రాయబారి పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. చిరునామా : 2107, Massachusetts Avenue, Nw, Washington, DC 20008. సమావేశం తర్వాత మూర్తి లా ఫర్మ్‌కు చెందిన న్యాయనిపుణులతో ఒక సమావేశం ఉంటుంది. బాధిత విద్యార్థి ఎవరైనా తమ సందేహాలను ఈ సమావేశంలో చర్చించి పరిష్కరించుకోవచ్చు. సదర్న్ మిసిసిపి విశ్వవిద్యాలయం, ముర్రే స్టేట్ విశ్వవిద్యాలయం, కాన్‌కార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతినిధులు కూడా ఈ సందర్భంగా అందుబాటులో ఉంటారని, విద్యార్థులు తమ బదలీలకు సంబంధించిన అన్ని సందేహాలను తీర్చుకోవచ్చునని ఆయన చెప్పారు.

పెక్కుమంది విద్యార్థులు బ్యాంకు రుణాలతో చదువుకుంటున్నారని, ప్రస్తుతం వర్జీనియా విశ్వివిద్యాలయ బాధిత విద్యార్థులు తమ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారని, ఈ డిసెంబర్‌లో చదువు పూర్తి చేసుకోవలసిన విద్యార్థులు మళ్లీ మొదటినుంచీ అడ్మిషన్లు పూర్తి చేసుకురావాలంటే చాలా కష్టమని, అందువల్ల విద్యార్థుల భవితవ్యానికి అధికారులు సానుకూల చర్యలు తీసుకోవాలని తానా కోశాధికారి సతీష్ వేమన పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల తొలి సదస్సు

అంతర్జాతీయ తెలుగు అంతర్జాల తొలి సదస్సు సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో మూడు రోజుల పాటు జరగనున్నది. అంతర్జాల యుగంలో తెలుగు అనే మకుటంతో జరుగనున్న ఈ సదస్సులో ఈ రంగంలో ఇప్పటికే విశేష కృషి చేస్తున్న తెలుగు భాషా నిపుణులు, కంప్యూటర్ సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

అంతర్జాలంలో తెలుగును మరింత తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉండేటట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే దిశగా ఈ సదస్సు జరగనున్నది. సెప్టెంబర్ 28 వ తేదీన ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల సదస్సులో తెలుగు భాషలో అంతర్జాల వినియోగాన్ని భవిష్యత్తులో మరింతగా పెంపొందించుకోవడానికి ఏమి చేయాలన్న అంశాన్ని లోతుగా చర్చిస్తారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఈ సదస్సులో పత్రాలు సమర్పిస్తారు.

రానున్న దశాబ్ద కాలంలో అంతర్జాలంలో తెలుగు భాషకు ప్రాధాన్యం పెరుగనున్న దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరికరాలలో రేపటి తెలుగు భాష వినియోగానికి ఇప్పటినుంచే సోపానాలు వేయడం ఎలా, సాధనాలు రూపొందించడం ఎలా అన్న అంశాన్ని వివిధ కోణాలలో పరిశీలించి నిపుణులు ఈ సదస్సులో సూచనలు ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ఐ.టి. మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ దిశగా సదస్సుకు అంకురార్పణ చేసినట్టు సదస్సు నిర్వాహకులు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల తెలియజేశారు. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన విదే శీ భాషల విభాగంలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ పేరి భాస్కర రావు ఈ సదస్సు అధ్యక్షునిగా ఉంటారని ఆయన వె ల్లడించారు.

ప్రవాసాంద్రుల ధాతృత్వం మరువలేనిది : నందమూరి బాలకృష్ణ

  బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ న్యూయార్క్ విచ్చేసిన సందర్భంగా ఆయన అభిమానులు, ప్రవాసాంద్రులు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లోని ప్రవాసాంద్రులు డాక్టర్ పోలవరపు తులసీ, డాక్టర్ రాఘవరావులు ఈ నిధుల సేకరణకు ఓ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రసంగిస్తూ ప్రవాసాంద్రుల ధాతృత్వం మరువలేనిదని, దేశానికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేపట్టబోయే కార్యక్రమాలు, హస్పత్రిలో వసతుల గురించి వివరించారు. క్యాన్సర్ మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రవాసాంద్రులు ఇక ముందు ఇలానే చేయూతనివ్వాలని ఆయన కోరారు.

బాలయ్య చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమానికి న్యూయార్క్‌లో వేశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ప్రవాసాం«ద్రులు, అభిమానులు తమ పూర్తి మద్దతు తెలుపుతూ విరాళాల వర్షం కురిపించారు. బాలయ్య పర్యటించిన నగరాల్లో న్యూయార్క్‌లోనే ఎక్కువగా దాతలు ముందుకొచ్చారు. సుమారు కోటి రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చారు.

అంతకు ముందు బాలకృష్ణ శాన్‌ హోషే, లాస్ ఏంజెలెస్, అట్లాంటా, చికాగో, డల్లాస్, సెయింట్ లూసీ, వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరిగా న్యూయార్క్‌లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి న్యూయార్క్‌తో సహా న్యూజెర్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, ప్రవాసాంద్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. బసవతారకం ఆస్పత్రి ట్రస్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హాస్పటల్ లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమం అనతరం బాలకృష్ణ అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాకు బయలుదేరారు. అమెరికాలోని ఆత్మీయులు, అభిమానులు బాలయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ప్రవాసులకు తానా టీమ్ స్క్వేర్ సేవలు


: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కోసం తానా సంస్థ అనేక సహాయ సహకారాలను అందజేస్తున్నది. అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించిన వారి భౌతిక కాయాలను భారతదేశానికి తరలించడానికి తానా బృందం టీమ్ స్క్వేర్ ఎంతగానో కృషి చేస్తున్నదని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర వెల్లడించారు.

ఇటీవల అయోవాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మద్ది సురేస్ బాబు (37) పరిమితికి మించి అధికంగా మందులు సేవించడం వల్ల జూలై 11న మృతి చెందారు. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేట్ అయిన సురేష్ స్వస్థలం గుంటూరు జిల్లా లోని దూలిపల్లి గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని భారత దేశానికి తరలించడానికి సహాయాన్ని అందించవలింసిందిగా సురేష్ స్నేహితులు , కుటుంబసభ్యులు కలిసి తానాను కోరడంతో వెంటనే స్పందించిన టీమ్ స్క్వేర్ చైర్మన్ అంజయ్య చౌదరి లావు, తానా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని సురేష్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు చేరుకునేలా అన్ని ఏర్పాట్లను చేశారని ఆయన వివరించారు.

జూలై 3 న శ్రీమతి డోకె అనే మహిళ మృతి చెందారు. ఆమె మృతదేమాన్ని జూలై 6 హైదరాబాద్‌కు తరలించారు. జూలై 4 న ఐ.టీ. కన్సల్టెంట్ అయిన జయరామ్ పంగిపల్లి ప్రమాదవ శాత్తు టెన్నీసీ నదిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జూలై 6 న హైదరాబాద్‌కు తరలించారు. జూలై 7 న వీరభద్రం గుండె పోటుతో మరణించారు. ఆయన మృత దేహాన్ని జూలై 10న చెన్నైకి తరలించారు.

అమెరికాలో మరణించిన మద్ది, డోకె, పంగిపల్లి, వీరభద్రం కుటుంబాలకు తానా అధ్యక్షులు తోటకూర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంతటి సహాయ సహకారాలు అందించిన తానా బృందం స్క్వేర్ వాలంటీర్లు అయిన గోపాల్ వేదుల, నగేష్ నర్మత్, సురేష్ కాకర్ల, హనుమంత్ కంతి, వెంకట్ దుడ్డుకూరి, కవిత, పద్మ, జగన్మోహన్‌లకు అలాగే చనిపోయిన వారి మృతదేహాలను భారత దేశానికి తరలించడానికి సహాయ సహకారాలు అందించిన తానా నాయకులు అంజయ్య చౌదరి లావు, మోహన్ నన్నపనేనిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫ్లోరిడాలో అలరించిన సంగీత విభావరి



ఫ్లోరిడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌విల్లే సంస్థ ఇటీవల 10 వ సాంస్కృతిక వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది. మొట్టమొదటి సారిగా తాజా (టీఏజేఏ) కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేయర్ ఆల్విన్ బ్రౌన్ జ్యోతి ప్రజ్వలనతో సంగీత విభావరిని ప్రారంభించారు. అనంతరం ఆల్విన్ మాట్లాడుతూ ఇటీవల భారత్‌లో జరిగిన ముంబాయి పేలుళ్లలో మృతి చెందినవారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరంలో తొలి వేడుకను నిర్వహించిన తాజా (టీఏజేఏ) సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నహాలు చేస్తోంది. 800 మంది తెలుగు ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం తాజా(టీఏజేఏ) అధ్యక్షులు కీర్తిధర్ గౌడ్, కోఆర్డినేట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ మార్గనిర్దశకంలో గాయకులు రేవంత్, గీతా మాధురి, శ్రీకాంత్, మాళవిక, సుమంగళి పాడిన మెలొడీ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ప్రఖ్యాత గాయికులు పాడే చక్కటి తెలుగు సంగీతాన్ని వినడానికి ఎంతగానో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అలాగే హాస్యనటులు ఢిల్లీ రాజేశ్వరి, గౌతమ్ రాజు, కోట శంకర్‌రావు, గీతా సింగ్, సౌమ్య రాయ్ చేసిన హాస్యం ప్రేక్షకులను అలరించింది.

తాజా కమిటీ ఉపాధ్యక్షులు వెంకన్న కరణం, కోశాధికారి సురేష్ పిట్టపల్లి, సెక్రెటరీ ఉపేంద్ర రెడ్డి, కమిటీ సభ్యులు సుధీర్ కొండపోలు, వెంకట్ పంపులపాటి, కార్యక్రమ కోఆర్డినేటర్ మాలిని రెడ్డి, శాంత రాయప్రోలు, రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ మిర్యాల, శరత్ రామిడి, వెంకట్ నందమూరి, మల్లేశ్వర్ రెడ్డి, మధు గబిట్ట, డాక్టర్ అశ్విన్ దావులూరి, డాక్టర్ రవి కంచె, శ్రీకాంత్ లాగిసెట్టి, బాలరాజ్‌గౌడ్, రావ్ గందమ్, రమన మూర్తి, జయప్రసాద్ తంబుగనిపల్లె, శ్రీకాంత్ బిక్కవల్లి, వాసు కాకవేటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో కృషి చేశారు.