గురువారం, ఆగస్టు 4

వర్జీనియా బాధిత విద్యార్థుల కోసం నేడే తానా ప్రత్యేక సమావేశం

వర్జీనియా విశ్వవిద్యాలయ విద్యార్థులకోసం శుక్రవారంనాడు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి విద్యార్థులు అందరూ హాజరు కావాలని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో భారత రాయబారి పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. చిరునామా : 2107, Massachusetts Avenue, Nw, Washington, DC 20008. సమావేశం తర్వాత మూర్తి లా ఫర్మ్‌కు చెందిన న్యాయనిపుణులతో ఒక సమావేశం ఉంటుంది. బాధిత విద్యార్థి ఎవరైనా తమ సందేహాలను ఈ సమావేశంలో చర్చించి పరిష్కరించుకోవచ్చు. సదర్న్ మిసిసిపి విశ్వవిద్యాలయం, ముర్రే స్టేట్ విశ్వవిద్యాలయం, కాన్‌కార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతినిధులు కూడా ఈ సందర్భంగా అందుబాటులో ఉంటారని, విద్యార్థులు తమ బదలీలకు సంబంధించిన అన్ని సందేహాలను తీర్చుకోవచ్చునని ఆయన చెప్పారు.

పెక్కుమంది విద్యార్థులు బ్యాంకు రుణాలతో చదువుకుంటున్నారని, ప్రస్తుతం వర్జీనియా విశ్వివిద్యాలయ బాధిత విద్యార్థులు తమ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారని, ఈ డిసెంబర్‌లో చదువు పూర్తి చేసుకోవలసిన విద్యార్థులు మళ్లీ మొదటినుంచీ అడ్మిషన్లు పూర్తి చేసుకురావాలంటే చాలా కష్టమని, అందువల్ల విద్యార్థుల భవితవ్యానికి అధికారులు సానుకూల చర్యలు తీసుకోవాలని తానా కోశాధికారి సతీష్ వేమన పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి