గురువారం, ఆగస్టు 4

ఫ్లోరిడాలో అలరించిన సంగీత విభావరి



ఫ్లోరిడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌విల్లే సంస్థ ఇటీవల 10 వ సాంస్కృతిక వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది. మొట్టమొదటి సారిగా తాజా (టీఏజేఏ) కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేయర్ ఆల్విన్ బ్రౌన్ జ్యోతి ప్రజ్వలనతో సంగీత విభావరిని ప్రారంభించారు. అనంతరం ఆల్విన్ మాట్లాడుతూ ఇటీవల భారత్‌లో జరిగిన ముంబాయి పేలుళ్లలో మృతి చెందినవారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరంలో తొలి వేడుకను నిర్వహించిన తాజా (టీఏజేఏ) సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నహాలు చేస్తోంది. 800 మంది తెలుగు ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం తాజా(టీఏజేఏ) అధ్యక్షులు కీర్తిధర్ గౌడ్, కోఆర్డినేట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ మార్గనిర్దశకంలో గాయకులు రేవంత్, గీతా మాధురి, శ్రీకాంత్, మాళవిక, సుమంగళి పాడిన మెలొడీ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ప్రఖ్యాత గాయికులు పాడే చక్కటి తెలుగు సంగీతాన్ని వినడానికి ఎంతగానో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అలాగే హాస్యనటులు ఢిల్లీ రాజేశ్వరి, గౌతమ్ రాజు, కోట శంకర్‌రావు, గీతా సింగ్, సౌమ్య రాయ్ చేసిన హాస్యం ప్రేక్షకులను అలరించింది.

తాజా కమిటీ ఉపాధ్యక్షులు వెంకన్న కరణం, కోశాధికారి సురేష్ పిట్టపల్లి, సెక్రెటరీ ఉపేంద్ర రెడ్డి, కమిటీ సభ్యులు సుధీర్ కొండపోలు, వెంకట్ పంపులపాటి, కార్యక్రమ కోఆర్డినేటర్ మాలిని రెడ్డి, శాంత రాయప్రోలు, రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ మిర్యాల, శరత్ రామిడి, వెంకట్ నందమూరి, మల్లేశ్వర్ రెడ్డి, మధు గబిట్ట, డాక్టర్ అశ్విన్ దావులూరి, డాక్టర్ రవి కంచె, శ్రీకాంత్ లాగిసెట్టి, బాలరాజ్‌గౌడ్, రావ్ గందమ్, రమన మూర్తి, జయప్రసాద్ తంబుగనిపల్లె, శ్రీకాంత్ బిక్కవల్లి, వాసు కాకవేటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో కృషి చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి